Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
2023 మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో 22 ఏళ్ల భారత బాక్సర్ నీతూ గంగాస్ సత్తా చాటింది. శనివారం జరిగిన ఫైనల్లో మంగోలియా బాక్సర్ లుత్సాయిఖాన్ అట్లాంట్సెట్సెగ్ను 5-0 తేడాతో పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో తొలిసారిగా ఫైనల్ ఆడిన నీతూ గంగాస్బౌట్ ప్రారంభంతోనే ప్రత్యర్థిపై పంచ్ల వర్షం కురిపించింది. 48 కిలోల విభాగంలో తొలి రౌండ్లో మంగోలియన్ బాక్సర్కు ఎక్కడా సందు దొరకనీయలేదు. ఈ టోర్నీలో గంగాస్ కొరియా బాక్సర్ కాంగ్ డియోయాన్ను ఓడించడం ద్వారా తన జైత్రయాత్రను ప్రారంభించింది. క్వార్టర్ ఫైనల్లో జపాన్కు చెందిన వడా మడోకాను మట్టికరిపించి సెమీస్లో అడుగుపెట్టింది. సెమీస్లో అలువా బెల్కిబెకోవాపై 5-2 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసి ఫైనల్లో ప్రవేశించింది.