Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: ట్యాంక్ బండ్ పీవీ మార్గ్ నెక్లెస్ రోడ్ మార్గంలో 125 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకుంటున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహా నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ భారీ విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి రోజున సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న విషయం విధితమే. రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఈఎన్సీ గణపతి రెడ్డితో కలిసి సీఎస్ పనులను పరిశీలించారు. ఈ పనులన్నింటినీ ఏప్రిల్ 10వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంబేద్కర్ విగ్రహం కింది భాగంలో నిర్మిస్తున్న యాంపి థియేటర్ పనులను కూడా సీఎస్ పరిశీలించారు. ఈ విగ్రహ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న ల్యాండ్ స్కేపింగ్ పనులు, ఇతర సివిల్ పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ విగ్రహ పనుల పరిశీలన కంటే ముందు నూతన సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని కూడా సీఎస్ పరిశీలించారు.