Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: బీజేపీ నిరుద్యోగ మార్చ్పై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ నేతలు నిరుద్యోగ మార్చ్ చేయాల్సింది తెలంగాణలో కాదు.. ప్రధాని మోడీ ఇంటి ముందు చేయాలని కేటీఆర్ సూచించారు. ప్రతిపక్షాల మాటలను నమ్మొద్దని యువత, నిరుద్యోగులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో కేటీఆర్ మాట్లాడారు. బీజేపీ నేతలు నిరుద్యోగుల కోసం ధర్నాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో మోడీ.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు. ఆ మాట ప్రకారం ఈ 9 ఏండ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నా.. బీజేపీ నాయకుల్లారా.. కనీసం 18 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండా.. నిరుద్యోగ మార్చ్.. ఇక్కడ కాదు.. ఢిల్లీలోని నరేంద్ర మోడీ ఇంటి ముందు చేయాలి అని కేటీఆర్ అన్నారు.