Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రాకెట్ ప్రయోగాల్లో ఎంతో పురోగతి సాధించింది. గత కొన్నేళ్లుగా వాణిజ్య ప్రాతిపదికన విదేశీ ఉపగ్రహాలను కూడా రోదసిలోకి తీసుకెళుతోంది. తాజాగా ఇస్రో మరో వాణిజ్య రాకెట్ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. రేపు (మార్చి 26) ఉదయం 9 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎల్వీఎం3-ఎం3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ ప్రయోగం చేపట్టనున్నారు. బ్రిటన్ కు చెందిన వన్ వెబ్ సంస్థకు చెందిన ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఎల్వీఎం3-ఎం3 రాకెట్ ప్రయోగం మరికొన్ని గంటల్లో జరగనుండగా, షార్ కేంద్రంలో మిషన్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. కాగా, ఈ రాకెట్ ప్రయోగం నేపథ్యంలో, సంప్రదాయం ప్రకారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆయంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రయోగం విజయవంతం కావాలని ప్రార్థించినట్టు ఆయన తెలిపారు. రాకెట్ ప్రయోగ కౌంట్ డౌన్ సాఫీగా సాగుతోందని వివరించారు.