Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై
మహిళల ప్రీమియర్ లీగ్ తుది దశకు చేరుకుంది. నేడు లీగ్ దశలో టాప్లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్తో ఎలిమినేటర్ విజేత ముంబై ఇండియన్స్ తలపడనుంది. సీజన్ ఆరంభం నుంచి నిలకడగా రాణించిన ఇరు జట్లే ఫైనల్ చేరగా సమ ఉజ్జీల పోరులో హోరాహోరీ సమరం ఖాయమే. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ బ్యాటింగ్, బౌలింగ్లో సమతూకంగా ఉంటే టాపార్డర్ దుమ్మురేపుతుండటం ఢిల్లీకి కలిసి రానుంది. హర్మన్తో పాటు యస్తిక, హీలీ మాథ్యూస్, స్కీవర్ బ్రంట్, అమెలియా కెర్, పూజ వస్ర్తాకర్, ఇస్సి వాంగ్, సైకా ఇషాఖ్తో ముంబై పటిష్టంగా కనిపిస్తున్నది. ఆరు జట్లలో టైటిల్ ఎవరు గెలుచుకోనున్నారో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.