#ISRO launches LVM3-M3/Oneweb India-2 Mission from Satish Dhawan Space Centre (SDSC) SHAR, #Sriharikota.#LVM3M3/#Oneweb pic.twitter.com/PAOTJSSl9J
— All India Radio News (@airnewsalerts) March 26, 2023
Authorization
#ISRO launches LVM3-M3/Oneweb India-2 Mission from Satish Dhawan Space Centre (SDSC) SHAR, #Sriharikota.#LVM3M3/#Oneweb pic.twitter.com/PAOTJSSl9J
— All India Radio News (@airnewsalerts) March 26, 2023
నవతెలంగాణ - తిరుపతి
ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి వన్వెబ్తో ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా మొదటి 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబరు 23న ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. తాజాగా రెండో విడత 36 ఉపగ్రహాలను పంపింది.
ఈ తరుణంలో తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఎల్వీఎం-3 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ ప్రక్రియ 24.30 గంటల పాటు కొనసాగింది. బ్రిటన్ సంస్థ వన్ వెబ్ కు చెందిన 36 ఉపగ్రహాలను ఎల్వీఎం-3 రాకెట్ మోసుకుని వెళుతోంది. ఉపగ్రహాల మొత్తం బరువు 5.8 టన్నులు. వీటిని ఎల్వీఎం-3 రాకెట్ వివిధ కక్ష్యల్లో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఈ ఉప్రగహ వాహకనౌక రోదసిలో చేపడుతున్న వివిధ ప్రక్రియలను ఇస్రో శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తున్నారు.