Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జనగామ
జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డలో దారుణం చోటుచేసుకుంది. వదినపై మరిది రోకలిబండతో దాడి చేశాడు. దీంతో మృతి వదిన చెందింది. స్థానికుల వివరాల ప్రకారం కొద్దిరోజులుగా కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అన్న భార్య అయిన మాలోతు విజయపై మరిది మోహన్ కోపం పెంచుకున్నాడు. అన్న భార్య మాలోతు విజయ ఎప్పుడు ఏదో ఒక కారణంతో కుటుంబంతో గొడవకు దిగేది. దీంతో మోహన్ వదిన అయిన విజయను సర్దుకుపోవాలని చెప్పిన మళ్లీ మొదటికే రావడంతో విసుగు చెందిన మరిది మోహన్ వదిన విజయపై రోకలిబండతో దాడి చేశాడు. ఈ క్రమంలో రోకలి బండితో గట్టిగా తలపై కొట్టడంతో విజయ కుప్పకూలిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆస్పత్రికి తరలించినప్పటికి ఆమె మృతి చెందింది. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మోహన్ ను అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు.