Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో పంపిన 36 ఉపగ్రహాలను ఎల్వీఎం-3 రాకెట్ కక్ష్యలోకి చేర్చింది. రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. ఆదివారం ఉదయం శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్) లో ఎల్వీఎం-3 రాకెట్ ప్రయోగం జరిగింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు షార్ ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం-3 రాకెట్ నింగిలోకి ప్రయాణం ప్రారంభించింది. ఈ క్రమంలో దాదాపు 20 నిమిషాల ప్రయాణం తర్వాత భూమి ఉపరితలం నుంచి 450 కి.మి. చేరుకుంది. మోసుకెళ్లిన ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా లియో ఆర్బిటల్ వృత్తాకార కక్ష్యలోకి రాకెట్ ప్రవేశపెట్టింది.