Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, రాహుల్ గాంధీపై పార్లమెంట్ లో అనర్హత వేటు వేయడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. వేటు అప్రజాస్వామికమని విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాహుల్ గాంధీకి మద్దతుగా ఆదివారం (ఈ రోజు) ఉదయం నుంచి సాయంత్రం దాకా దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
ఇందులో భాగంగా ‘సంకల్ప్ సత్యాగ్రహ’ పేరుతో నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఢిల్లీలోని రాజ్ ఘాట్ దగ్గర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసింది. అయితే, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయనే కారణంతో పోలీసులు ఈ దీక్షకు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ దీక్ష కొనసాగిస్తోంది. మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలతో పాటూ పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు దీక్షలో కూర్చున్నారు. అంతే కాకుండా నేడు సాయంత్రం హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై తెలంగాణ సీటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ప్రదర్శన చేబడుతున్నారు.