Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోల్కతా
పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఓ మసీదులో రంజాన్ ప్రార్ధనల అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్న వంద మందికి పైగా అస్వస్ధతకు గురయ్యారు. అస్వస్ధతకు లోనైన వారిని కోల్కతాలోని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించగా వారిలో పలువురి పరిస్ధితి విషమంగా ఉంది. కుల్తాలి పోలీస్స్టేషన్ పరిధిలోని పఖిరలయ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఇలా జరిగిందని రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. రాత్రి కొందరు కడుపునొప్పి, వాంతులతో బాధపడుతూ తమ క్లినిక్కు వచ్చారని, రోజా అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్న తర్వాత ఫుడ్ పాయిజన్ కావడంతో వారు అస్వస్ధతకు లోనయ్యారని తెలిసిందని డాక్టర్ హరిసూధన్ మొండల్ తెలిపారు.