Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కాందార్ లోహా పర్యటనకు ప్రగతి భవన్ నుంచి బయల్దేరారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్.. మహారాష్ట్రలోని నాందేడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలిక్యాఫ్టర్లో బయలుదేరి లోహా పట్టణ శివారులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. లోహాలోని ఓ బీఆర్ఎస్ అభిమాని ఇంట్లో తేనీటి విందులో పాల్గొంటారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్లో బయలుదేరి నేరుగా పట్టణంలోని బైల్ బజార్ సభాప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సభా ప్రాంగణంలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.