Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనకు సమాన్లు జారీ చేయడాన్ని ఆమె దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసిన విషయం తెలిసింది.
ఈ తరుణం మార్చి 24వ తేదీన తొలుత కవిత పిటిషన్పై విచారణ జరగాల్సి ఉండగా జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ్టికి విచారణను వాయిదా వేసింది. ఐటెం నెంబర్ 36గా కవిత పిటిషన్ లిస్ట్ అయ్యింది. ఈడీ జారీ చేసిన సమాన్లు రద్దు చేయాలని, మహిళలను ఇంటి వద్దే విచారణ చేయాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి (అరెస్ట్) చర్యలు తీసుకోవద్దని పై సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు కల్వకుంట్ల కవిత. దీంతో నేడు విచారణ జరుగనుంది.