Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇజ్రాయిల్
దేశ రక్షణ మంత్రి యోవా గాలెంట్ ను ప్రధాని బెంజిమెన్ నెతాన్యూ తొలగించారు. దీంతో ప్రధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. న్యాయ వ్యవస్థను మార్చాలని నెతాన్యూ చేసిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా రక్షణ మంత్రి మాట్లాడారు. దీంతో ఆయన్ను క్యాబినెట్ నుంచి ప్రధాని తొలగించారు. జెరుసలాంలో జరిగిన ప్రదర్శనలో పోలీసులు, సైనికులు వాటర్ క్యానన్లతో నిరసనకారుల్ని చెదరగొట్టారు.
న్యాయ వ్యవస్థలో చేపట్టాలనుకుంటున్న సంస్కరణలను ఆపివేయాలని ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఇజాక్ హెర్జోగ్ పిలుపునిచ్చారు. కొత్త చట్టాల సంస్కరణల ప్రకారం జడ్జిల నియామకం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఈ విషయంలో వ్యతిరేక వ్యక్తం అవుతోంది. కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జోరందుకున్నాయి. అన్ఫిట్గా తేలిన నాయకున్ని తొలగించాలన్న నిబంధనలను కూడా మార్చనున్నారు. అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంజిమన్ నెతన్యూ చట్టాల మార్పుతో శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.