Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : జిహెచ్ఎంసి చెత్త సేకరణ వాహనం కిందపడి చిన్నారి మృతిచెందిన విషాద సంఘటన మేడ్చల్ లో సోమవారం చోటుచేసుకుంది. మౌలాలి ఆర్టీసీ కాలనీలో వాహనం కిందపడి 16 నెలల బాలుడు మృత్యువాత పడ్డాడు. వాహనం రివర్స్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. డ్రైవర్ అజాగ్రత్త వల్లే బాలుడు మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి బాలుడు చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.