Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో కొత్త ఓటర్ల నమోదు, సవరణల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పోర్టల్ ను తీసుకువచ్చింది. ఇప్పుడున్న ఎన్వీఎస్పీ స్థానంలో ఇక నుంచి కొత్త పోర్టల్ ద్వారా సేవలు అందించాలని ఈసీ నిర్ణయించింది. ఇకపై voters.eci.gov.in పోర్టల్ ద్వారా ఓటర్ల నమోదు తదితర ప్రక్రియలు కొనసాగుతాయని వివరించింది. ఈ నూతన పోర్టల్ ద్వారా బీఎల్ఓ, ఈఆర్ఓల సమాచారం పొందే వీలుంటుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఓ ప్రకటన చేసింది.