Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసునని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గం అమీర్పేట డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 75 సంవత్సరాలు పాలించిన పాలకులు ఏనాడూ 24 గంటలు విద్యుత్ ఇవ్వలేదన్నారు. మంచినీటి సమస్యను పట్టించుకోలేదని ఆరోపించారు. ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద రూ.1,00,116 ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. ఇంటి పెద్ద కొడుకు మన కేసీఆర్ అని, ప్రతి నెల వృద్ధులకు రూ.2వేల పెన్షన్ ఇస్తున్నాడన్నారు. ఇల్లు లేని వారికి త్వరలోనే ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద సొంతింటి జాగ ఉంటే ఇల్లుకట్టుకునేందుకు రూ.3లక్షల ఇవ్వనుందన్నారు. ఎన్నికల సమయంలో తాత్కాలిక ఆవేశాలకు లోనై నిర్ణయాలు తీసుకోకూడదన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామన్నారు. ఇక్కడ గెలిచిన ఎంపీ నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడైనా మిమ్మల్ని కలిశాడా? అని ప్రశ్నించారు. గతంలో నియోజకవర్గ పరిధిలో వంద మందికి దళితబంధు పథకం ఇచ్చామన్నారు. ఈ సారి నియోజకవర్గ పరిధిలో 1,150 మందికి దళితబంధు పథకం అమలు చేయనున్నారన్నారు.