Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో 200 పడకల మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రానికి (ఎంసీహెచ్) ముహూర్తం ఖరారైంది. మంగళవారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా ఎంసీహెచ్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు. ప్రస్తుతం నిమ్స్లో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. మాతాశిశు సంరక్షణ కేంద్రం అందుబాటులోకి వస్తే గైనిక్, ప్రసవాల సేవలు కూడా ప్రజలకు చేరువ కానున్నాయి. అటు.. నిమ్స్లో 100 పడకల డయాలసిస్ యూనిట్, నూతన ఎంఆర్ఐ, డాప్లర్ యంత్రాలను మంత్రి ప్రారంభించనున్నారు. కొత్తగా నియమితులైన 27 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మంత్రి హరీశ్ రావు నియామక పత్రాలు అందజేస్తారని డాక్టర్ బీరప్ప పేర్కొన్నారు.