Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ నిఘా విభాగం అధికారులు విదేశీ బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు. ముందస్తు సమాచారంతో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద ఈ తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజామున 2.55 గంటలకు వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ 52.24 లక్షల విలువ చేసే 840 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకోగా.. తెల్లవారుజామున 3.45గంటలకు వచ్చిన మరో ప్రయాణికుడి నుంచి రూ.14.23 లక్షల విలువైన 233 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. మొదటి ప్రయాణికుడు ముద్ద రూపంలో బంగారాన్ని తీసుకురాగా.. రెండో ప్రయాణికుడు తున చేప ఆయిల్ డబ్బాల మధ్య దాచుకుని తెచ్చినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.