Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి చిట్ఫండ్ కేసులో ఈనాడు అధినేత రామోజీరావుకు సిఐడి నోటీసులు ఇచ్చింది. రామోజీరావుతో పాటు చెరుకూరు శైలజకు సిఐడి నోటీసులు ఇచ్చింది. సిఐడి డిఎస్పి రవి కుమార్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29, 31, ఏప్రిల్ 3, 6 తేదీల్లో విచారణకు అందుబాటులో ఉండాలని సిఐడి నోటీసులు జారీ చేసింది. ఇల్లు లేదా ఆఫీసులో విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసులో పేర్కొన్నారు. మార్గదర్శి చిట్ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో సిఐడి విచారణ చేస్తుంది. ఎ1గా రామోజీరావు, ఎ2గా చెరుకూరి శైలజను సిఐడి రికార్డులో పేర్కొంది.