Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. నిమ్స్కు అనుబంధంగా.. ఎర్రమంజిల్లో నిర్మించే 200 పడకల మాతా, శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి మంత్రి హరీశ్రావు మంగళవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను మొదటిసారిగా రాష్ట్రంలో తొలిసారిగా హైదరాబాద్లో ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. గతంలో రాష్ట్రంలో మూడు ఎంసీహెచ్ ఆస్పత్రులు మాత్రమే ఉండే. ఆ సంఖ్యను 27కు పెంచుకున్నాం. తద్వారా గొప్ప ఫలితాలు వచ్చాయి. ఎంసీహెచ్ ఆస్పత్రుల నిర్మాణానికి రూ. 499 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపారు. ఎంసీహెచ్ ఆస్పత్రులను 27కు పెంచడంతో మాతా శిశు మరణాలు తగ్గాయి. తెలంగాణ ఏర్పడక ముందు మాతా మరణాలు ప్రతి లక్షకు 92 మరణాలు ఉండే.. దాన్ని 43కు తగ్గించగలిగాం. ప్రతి లక్షకు శిశు మరణాలు 36 ఉంటే 21కి తగ్గించుకున్నాం అని తెలిపారు. మాతాశిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలో మూడో స్థానంలో ఉన్నాం. మొదటి స్థానానికి వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అవసరం ఉందని హరీశ్రావు స్పష్టం చేశారు.