Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒంగోలులోని విరాట్నగర్లోఅంజిరెడ్డి, పూర్ణిమలు కొన్నేళ్ల క్రితం విహహం చేసుకున్నారు. వీరిద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా వీరి మధ్యకుటుంబ కలహాల కారణంగా గొడవలు జరిగాయి.దీంతో ఆగ్రహంతో భర్త అంజిరెడ్డి భార్య పూర్ణిమను చపాతి కర్రతో కొట్టి చంపాడు. భర్త అంజిరెడ్డి అక్కడి నుంచి పారిపోయి కొత్తపట్నం వద్ద సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.