Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విజయవాడ
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసింది. జూన్ 3 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. 2022 సివిల్స్ ఫేజ్- 3 ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు ప్రకటించడంతో గ్రూప్ వన్ మెయిన్స్ వాయిదా వేయాల్సి వచ్చింది.
ఈ ఇంటర్వ్యూల షెడ్యూల్ను యూపీఎస్సీ సోమవారమే విడుదల చేసింది. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూలకి ఏపీ నుంచి దాదాపు 25 మంది గ్రూప్ వన్ అభ్యర్థులు హాజరవుతున్నారు. దీంతో ఈ ఇంటర్వ్యూల కారణంగా గ్రూప్-1 మెయిన్స్ని జూన్లో నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. సివిల్స్ ఇంటర్వ్యూలకి ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకునే మెయిన్స్ వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ మెంబర్ సలాంబాబు తెలియజేశారు.