Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు: కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మండ్య జిల్లాలో ప్రజాధ్వని యాత్ర సందర్భంగా కరెన్సీ నోట్లు వెదజల్లిన ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావిస్తున్న శివకుమార్ జిల్లాలోని బేవినహళ్లిలో మంగళవారం ప్రజలపై కరెన్సీ నోట్లు వెదజల్లారు. ఈసారి మండ్యలో మొత్తం 7 స్థానాలను గెలిచేలా కార్యకర్తలు శపథం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.