Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 450 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81,42,509కి చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 79,91,728 మంది కోలుకోగా, 1,48,438 మంది మరణించారని తెలిపింది. 2343 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, 24 గంటల్లో 316 మంది కోలుకోగా, ముగ్గురు మరణించారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కొత్తగా 135 కేసులు నమోదవడంతో మొత్తం కేసులు 11,55,662కు చేరాయి. ఇందులో 19,747 మంది కరోనా బాధితులు మరణించారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.15 శాతం ఉండగా, మరణాల రేటు 1.82 శాతంగా ఉంది. ఇక దేశంలో మంగళవారం 1,573 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 4,47,07, 525కి చేరింది.