Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు అధికారి రాంసింగ్ను కొనసాగించడంపై న్యాయమూర్తి ఎం ఆర్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. తులసమ్మ కేసులో మరో దర్యాప్తు అధికారిపై సుప్రీం కోర్టుకు సీబీఐ నివేదిక అందజేసింది. రాంసింగ్తో పాటు మరోకరి పేరును సీబీఐ సూచించింది. ఈ క్రమంలో రాంసింగ్ను కొనసాగించడంపై న్యాయమూర్తి ఎం ఆర్ షా అభ్యంతరం తెలిపారు. కేసు దర్యాప్తులో పురోగతి సాధించనప్పుడు రాంసింగ్ను కొనసాగించడంలో అర్ధం లేదని న్యాయమూర్తి అన్నారు. వివేక కేసులో విచారణ ఆలస్యం అవుతున్నందున ఏ5 శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరీ చేయాలని ఆయన భార్య తులసమ్మ కోర్టును కోరారు. ఆ విషయాన్ని పరిశీలిస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. దీనిపై ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. అయితే ఈ కేసును దర్యాప్తును ఏప్రిల్ 15కల్లా పూర్తి చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది.