Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జికి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. తాను జాతీయ గీతాన్ని అగౌరవపర్చానంటూ దాఖలైన పిటిషన్ను రద్దు చేయాలంటూ మమతాబెనర్జి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. 2021, డిసెంబర్లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మమతాబెనర్జి జాతీయ గీతాన్ని అగౌరవపర్చారంటూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో తాను నేరం చేయలేదని, ఆ పిటిషన్ను కొట్టివేయాలని మమతాబెనర్జి అప్పీల్ చేశారు. ఆ అప్పీల్ను తాజాగా కోర్టు తోసిపుచ్చింది. 2021లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ గీతాన్ని అగౌరవపర్చినందుకు మమతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఓ బీజేపీ నేత మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. మమత ముంబై పర్యటన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఆమె లేచి నిలిబడలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. మమత జాతీయగీతాన్ని అవమానించారని ఆరోపించారు. ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ను కోర్టుకు సమర్పించాడు. అనంతరం ఈ అంశం బాంబే హైకోర్టుకు చేరింది.