Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులును ప్రకటించింది. 2023-24 విద్యా సంవత్సరం జూన్12 న ప్రారంభం కానుంది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 20 వరకు SA – II పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, ఆరు నుంచి ఎనిమిది తరగతులకు 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి మ. 12:30 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21 నుంచి 24 వరకు పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. ఆ తరువాత విద్యార్థులకు మార్కులు చెప్పి సెలవులు ఇస్తారు.