Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నూతన ఆర్ధిక సంవత్సరాన్ని పురస్కరించుకుని NHAI కి సంబంధించి టోల్ చార్జీలను పెంచుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎంత శాతం పెరుగుతాయన్నది ఇంకా ఒక క్లారిటీ రాలేదు. బహుశా ఏప్రిల్ ఒకటవ తేదీన తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై తెలంగాణ రోడ్లు మరియు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. తెలంగాణ హైవేలకు సంబంధించి మొత్తం 32 టోల్ గేట్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లేఖలో మంత్రి మాట్లాడుతూ , ఇప్పటికే ఉన్న టోల్ చార్జెస్ తెలంగాణా ప్రజలకు అధిక భారంగా మారిందని ఇంతలోనే మళ్ళీ వాటిని పెంచితే మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ఉంటుందని చమత్కరించారు. ప్రధాన విషయాన్ని తీసుకుని అన్ని సమీకరణాలను మంత్రి గడ్కరీకి ఈ లేఖలో ప్రశాంత్ రెడ్డి వివరించే ప్రయత్నం చేశారు. మరి కేంద్రం ఈ లేఖను పరిగణలోకి తీసుకుని టోల్ చార్జీలు పెంపు విషయంలో ఏమైనా మార్పులు చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.