Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి: జిల్లాలోని భూపాలపల్లి మండలం వేషాలపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య రమ(38), కూతురు చందన(17)ను రమణాచారి గొడ్డలితో నరికి చంపేశాడు. మృతుల బంధువులు, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. నిందితుడికి గ్రామస్తులు, స్థానికులు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులకు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, ఘటనకు సంబంధించి వివరాలను అడిగితెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లీకూతురిని గొడ్డలితో నరికి చంపాల్సిన పరిస్థితి రావడం వెనుక కారణాలను తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమైయ్యారు.