Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కరీంనగర్
పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని పోలీసులు ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. జనతా కర్ఫ్యూ కొనసాగు తున్న సమయంలో గంగాధర మండలం మధురానగర్కు చెందిన రాధిక ఆది వారం పురిటి నొప్పులతో బాధపడుతోంది. వాహనంలో తరలించడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించగా అందరు బంద్లో పాల్గొంనారు. కుటుంబ సభ్యులు విషయాన్ని ఎస్ఐ తాండ్ర వివేక్కు తెలపగా వెంటనే బాధితురాలి ఇంటికి చేరుకుని పోలీసు వాహనంలో గర్భిణిని కరీంనగర్కు తరలించారు. ఆపద సమయంలో నిండు గర్భిణిని పోలీసు వాహనంలో వైద్యశాలకు తరలించి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ వివేక్, కానిస్టేబుల్ పరుశు రాములును మండల ప్రజలు అభినందిం చారు. రాధికకు పండంటి కూతురు జన్మించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.