Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మనీలా
దక్షిణ ఫిలిప్పీన్స్లో జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 31కి చేరుకున్నది. ఫెర్రీలో అగ్నిప్రమాదం జరగడం వల్ల భారీగా ప్రాణ నష్టం సంభవించింది. కాలిపోయిన ఓడ శిథిలాల్లో అనేక మంది మృతదేహాలను గుర్తించారు. మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు బాసిలన్ గవర్నర్ జిమ్ సల్లిమాన్ తెలిపారు.
సులు ప్రావిన్సులో ఉన్న మిండనావో దీవిలోని జాంబోంగా సిటీ నుంచి జోలో దీవికి వెళ్తున్న ద లేడీ మేరీ జాయ్ 3 ఫ్రెరీలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఆ సమయంలో ఆ పడవలో ఉన్న ప్రయాణికులు భయంతో సముద్రంలోకి జంప్ చేశారు. ఫిలిప్పీన్స్ కోస్టు గార్డుతో సహా జాలర్లు ప్రయాణికుల్ని రక్షించారు. ఫెర్రీలో ఉన్న సుమారు 195 మంది ప్రయాణికుల్ని కాపాడారు. మరో 35 మంది సిబ్బంది కూడా ఉన్నారు. 14 మందికి గాయాలు కాగా, మరో ఏడు మంది ఆచూకీ లేకుండాపోయారు. షిప్ లిస్టులో 205 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.