Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎయిర్ ఇండియాలో మూత్రవిసర్జన ఘటన మరువకముందే ఇండిగో విమానంలో మరో దుశ్చర్య చోటుచేసుకుంది. మార్చి 26న గువాహటి నుంచి ఢిల్లీ వెళుతున్న విమానంలో ఓ వ్యక్తి తప్పతాగి తన సీటు పక్కనే వాంతులు చేసుకున్నాడు. టాయిలెట్ వద్ద మలవిసర్జన చేశాడు. దీంతో విమానంలోని సిబ్బంది, తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన ఫొటోను అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ న్యాయవాది ట్విటర్లో పోస్టు చేసి ఆవేదన వ్యక్తం చేయడంతో విషయం వెలుగుచూసింది. ఆ పరిస్థితుల్లో బాధ్యతగా వ్యవహరించిన విమాన సిబ్బందిని ఆయన ప్రశంసించారు. ఓ వ్యక్తి తప్పతాగి సీట్ల పక్కనే వాంతి చేసుకున్నాడు. టాయిలెట్ వద్ద మలవిసర్జన చేశాడు. శ్వేత అనే యువతి ఆ చోటంతా శుభ్రం చేసింది. అమ్మాయిలందరూ పరిస్థితిని చక్కదిద్దారు. మహిళా శక్తికి నా సెల్యూట్ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన యూజర్లు సంఘటనపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.