Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగించినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 11.01 నిమిషాలకు 15,497 మెగా వాట్ల విద్యుత్ (అత్యధిక పీక్ డిమాండ్) నమోదు అయ్యిందని వెల్లడించారు. మార్చి నెల ఆరంభం నుంచే 15,000 మెగా వాట్ల విద్యుత్ వినియోగం నమోదు అవుతూ వస్తోందని తెలిపారు.
ఈ తరుణంలో వేసవికాలంలో ఉష్ణోగ్రతలు అధికం కావడం, వ్యవసాయ రంగానికి విద్యుత్ వినియోగం పెరగడంతో రాష్ట్రంలో రోజురోజుకీ విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ వినియోగం అధికమవుతోంది. మొత్తం విద్యుత్ వినియోగంలో వ్యవసాయ రంగానికే 37 శాతం వాడినట్లు నమోదైంది. ఈ క్రమంలోనే మొత్తం విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానం కాగా, రెండో స్థానంలో తెలంగాణ నిలిచింది. నిన్న 14,422 మెగా వాట్లు కాగా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అత్యధికంగా రికార్డు స్థాయిలో గురువారం 15,497 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కావడం ఇదే తొలిసారి.