Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. తుది దశలో ఉన్న నిర్మాణ పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. భవనంలోని సెంట్రల్ హాల్లో టేబుళ్లు, నడక మార్గాల్లో కలియ తిరుగుతూ దాదాపు గంట సమయం పాటు ప్రధాని అక్కడే ఉన్నట్టు సమాచారం. అక్కడ కొనసాగుతున్న పనులన్నింటినీ పరిశీలించి పనిచేస్తున్న కార్మికులు, అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రధాని వెంట లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు. గతేడాది నవంబర్ నాటికే నిర్మాణం పూర్తి చేయాలని భావించినప్పటికీ.. కొవిడ్ కారణంగా ఆలస్యమైంది. ఈ నూతన భవనాన్ని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. అత్యాధునిక వసతులతో నిర్మాణం చేపట్టిన పార్లమెంట్ కొత్త భవనానికి 2020 డిసెంబర్లో శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.