Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కరోనా మహమ్మారి కారణంగా గత మూడేండ్లుగా కొన్ని పరిమితుల మధ్య సాగిన ఐపీఎల్.. తిరిగి పూర్వవైభవం సంతరించుకుంది. మొత్తం 10 జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్న ఐపీఎల్ 16వ సీజన్లో.. మూడేండ్లకు ముందు మాదిరిగా సొంత మైదానంలో సగం మ్యాచ్లు.. మిగిలిన సగం మ్యాచ్లు ప్రత్యర్థి వేదికలపై జరుగనున్నాయి. టెన్నిస్ తరహాలో సీడింగ్స్ విధానంలో జరుగనున్న గ్రూప్ దశ తొలి పోరులో గుజరాత్తో చెన్నై తలపడనుంది. సారథ్య బాధ్యతలు అందుకున్న తొలిసారే గుజరాత్కు టైటిల్ అందించిన పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. తనకు గురువైన మహేంద్రసింగ్ ధోనీతో తాడోపేడో తేల్చుకునేందుకు సమాయత్తమవుతున్నాడు.