Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుపతి: చంద్రగిరి మండలం తూర్పుపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను గుర్తుతెలియని వాహనం డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. స్నేహితుడి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తిరుపతికి చెందిన దినేష్(26 ), ఇమ్రాన్(27)గా పోలీసులు గుర్తించారు.