Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనేశ్వర్: ఒడిశాలోని సంబాల్పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెండ్లి వేడుకకు వెళ్లి తిరిగొస్తుండగా.. ఓ బొలెరో వాహనం అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో కారును వెలికితీశారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బాధితులు ఝార్సుగూడ జిల్లాలోని బదాధార గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. వారంతా సంబాల్పూర్లోని పరమన్పూర్ జరిగిన ఓ పెండ్లికి హాజరయ్యారయ్యారని, తిరుగుప్రయాణంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ప్రమాద సమయంలో బొలెరోలో 11 మంది ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.