Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: వేసవి వచ్చిందంటే చాలు తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా ఇవాళ ఢిల్లీలో, యూపీలో భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలోని వాజీపూర్ ఏరియాలోగల ఒక ఫ్యాక్టరీలో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
25 ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కాన్పూర్ నగరంలోని బాస్మండి ఏరియాలోగల ఏఆర్ టవర్లో కూడా ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.