Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్స్టేషన్ పరిధి దారుణం చోటుచేసుకుంది. పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాధం అల్కాపూర్ టౌన్షిప్లో జరిగింది. నార్సింగి అడ్మిన్ ఎస్సై బాలరాజు తెలిసిని వివరాల ప్రకారం గుంటూరు పట్టణానికి చెందిన వినోద్ కుమార్ (32) ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా గుంటూరు నుంచి పని చేసిన ఆయన ఆఫీస్కు వెళ్లాల్సి రావటంతో ఇటీవల అల్కాపూర్లోని సోదరుడి ఇంట్లో ఉంటూ విధులకు హాజరవుతున్నారు.
ఉద్యోగ నిర్వహణకు కొత్త టూల్స్ వస్తుండటంతో వాటిపై పట్టు సాధించలేకపోయిన వినోద్ ఆ విషయంపై తరచూ సోదరుడితో చర్చించినట్లు తెలిసింది. దీంతో పాటు ఉద్యోగ భద్రత లేకపోవటంతో గురువారం సోదరుడు, అతని భార్య బయటకు వెళ్లగా ఒంటరిగా ఉన్న వినోద్ కుమార్ బెడ్షీట్తో ఉరి వేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన సోదరుడు వెంటనే వినోద్ను ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.