Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ లో భాగంగా కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ బ్యాటింగ్ ముగిసింది. పంజాబ్ నిర్ణిత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో కోల్ కతాకు 192 పరుగుల భారీ టార్గెట్ ను నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ బ్యాట్స్ మెన్లు ఆరంభం నుంచి కోల్ కతా బౌలర్ల మీద విరుచుకుపడ్డారు. ఓపెనర్ ప్రబ్ సిమ్రాన్ (23), రాజపక్సే (50), శిఖర్ దావన్ (40), జితేష్ శర్మ (21), చివర్లో సామ్ కర్రన్ 26 నాటౌట్ గా నిలిచి జట్టుకు భారీ స్కోరును అందించాడు. ఇక కోల్ కతా బౌలర్లలో సౌధీ రెండు వికెట్లు తీయగా ఉమేష్ యదవ్, నరైన్ , వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.