Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నిజామాబాద్
నవీపేట్ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో రైలు కిందపడి గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు జారీ పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడని అతని వద్ద ఎటువంటి సమాచారం దొరకకపోవడంతో గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకొని పంచానామా నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు తెలిపారు. ఎవరికైనా అనుమానాలు ఉంటే రైల్వే పోలీసులకు సంప్రదించాల్సిందిగా కోరారు.