Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీలో సిట్ విచారణ కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకు 12 మందిని కస్టడీలోకి తీసుకొని విచారించిన సిట్ అధికారులు.. ఏప్రిల్ 1న టిఎస్పిఎస్సి సెక్రటరీ అనిత రామచంద్రన్, బోర్డు మెంబర్ లింగారెడ్డిలను విచారించారు. సిట్ చీఫ్ ఎఆర్ శ్రీనివాస్ అధ్వర్యంలో ఎంక్వైరీ కొనసాగింది. పేపర్ తయారీ, వాటి భద్రత,పరీక్షల నిర్వహణపై అధికారులు వారిని విచారించారు. మరోవైపు గ్రూప్ 1 లో 100 మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థులను సైతం సిట్ విచారించనుంది. మొత్తం 6 పరీక్షలకు చెందిన ప్రశ్న పత్రాలు లీక్ అయినట్లుగా సిట్ గుర్తించింది. ప్రస్తుతం శమీమ్, సురేష్, రమేష్ లను కస్టడీలోకి తీసుకుని సిట్ విచారణ చేస్తోంది.