Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మన హైదరాబాద్ నగరం లో క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. రెండేళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో మళ్ళి ఐపీఎల్ మ్యాచ్లు జరుగబోతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉప్పల్ వేదికగా ఏడు మ్యాచుల్లో ఆడబోతుంది. మొదటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడనున్నది ఎసార్హెచ్. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, క్రికెట్ అభిమానుల కోసం ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. ఆదివారం జరిగే మ్యాచ్ సందర్భంగా మెట్రో రైళ్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించినాట్లు తెలిపింది ప్రభుత్వం. రద్దీ కారణంగా నాగోల్-అమీర్పేట మార్గంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడుపనున్నట్లు అధికారులు తెలిపారు.
మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఎక్కువ సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు అధికారులు.