Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కఠ్మండూ: నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కఠ్మండూలోని మహారాజ్గంజ్లో ఉన్న త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కడుపునొప్పితో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని ప్రెసిడెంట్ ప్రిన్సిపల్ అడ్వైజర్ సురేశ్ ఛాలిసే తెలిపారు. నేపాల్ అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్ ఈఏడాది మార్చి 10న ఎన్నికయ్యారు. నేపాలీ కాంగ్రెస్కు చెందిన రామచంద్రను ప్రధాని ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్తో (మావోయిస్టు సెంటర్) పాటు ఎనిమిది పార్టీలు సంయుక్త అభ్యర్థి రామచంద్ర తన ప్రత్యర్థి.. పార్లమెంటులో రెండో అతిపెద్ద పార్టీ సీపీఎన్-యూఎంఎల్ మద్దతునిచ్చిన అభ్యర్థి సుభాష్ చంద్ర నెబ్మాంగ్పై విజయం సాధించారు. రామచంద్రకు 214 మంది ఎంపీలు, 352 మంది ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుల ఓట్లు వచ్చాయి.