Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఢిల్లీ
ఢిల్లీ కేపిటల్స్ సీమర్ ఖలీల్ అహ్మద్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన ఇండియన్ క్రికెటర్గా తన పేరును రికార్డు పుస్తకాలకు ఎక్కించాడు. లక్నోలోని ఏకనా స్డేడియంలో గత గత రాత్రి లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఖలీల్ ఈ ఘనత సాధించాడు. ఖలీల్ తన 35వ మ్యాచ్లోనే 50వ వికెట్ పడగొట్టాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు అమిత్ మిశ్రా పేరున ఉంది. అమిత్ 37 మ్యాచుల్లో 50 వికెట్లు పడగొట్టగా, ఖలీల్ రెండు మ్యాచ్ల ముందే ఆ ఘనత అందుకున్నాడు. మార్కస్ స్టోయినిస్, నికోల్ పూరన్ వికెట్లను తీసుకోవడం ద్వారా ఖలీల్ ఈ ఘనత అందుకున్నాడు. ఇక ఓవరాల్గా చూసుకుంటే దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ పేరున ఉంది. రబడ 27 మ్యాచుల్లోనే 50 వికెట్లు తీసుకున్నాడు.