Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మంచిర్యాల
బెల్లంపల్లి ఎమ్మెల్యేకు మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా కమిటి వార్నింగ్ ఇచ్చింది. సమస్యలతో వచ్చే మహిళలను ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం అలవాటుగా మారిందని.. ఎన్ని సార్లు హెచ్చరించినా బుద్ధి మార్చు కోవడం లేదని మావోయిస్టు కోల్ బెల్ట్ ఏరియా కార్యదర్శి ప్రభాత్ అన్నారు. అర్జిన్ డైరీకి ఎమ్మెల్యే అండదండలున్నాయని, ఎమ్మెల్యే వల్లనే రైతులు నష్టపోయారని అన్నారు. ఎమ్మెల్యేకు డైరీ నిర్వాహకులు అమ్మాయిలను సరఫరా చేశారన్నారు. రైతుల నుంచి వసూళ్లు చేసిన డబ్బులు వెంటనే చెల్లించాలని.. లేకుంటే ప్రజల చేతిలో శిక్ష తప్పదని ప్రభాత్ హెచ్చరించారు.