Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నై: తమిళనాడులోని వేలాచేరిలో మరోసారి షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాసులో చదవుతున్న పీహెచ్డీ విద్యార్థి సచిన్ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పశ్చిమబెంగాల్ వాసి అని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఐఐటీ-మద్రాసులో ఆత్మహత్యా ఘటనలు చోటుచేసుకోవడం ఇది మూడోసారి కాగా, 2018 నుంచి 11 ఘటనలు జరిగాయి. తాజా ఘటనపై పోలీసుల సమాచారం ప్రకారం, ఆత్మహత్యకు పాల్పడిన సచిన మార్చి 31న 'ఐయామ్ సారీ...అంత మంచిగా ఏమీ లేదు' అంటూ వాట్సాప్ స్టాటస్ పోస్ట్ చేశాడు. దీంతో మిత్రులు అతని ఇంటికి చేరుకునే సరికి గదిలో ఉరి వేసుకుని కనిపించాడు. అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించగా, వైద్యులు అతను మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం రాయపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.