Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అల్లుడు అత్తగారింటి ఎదుట ధర్నా చేసిన విచిత్ర ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. తన కొడుకుని చూపించకుండా అత్తమామలు తనను వేధిస్తున్నారంటూ అత్తగారింటి ఎదుట అల్లుడు నిరసనకు దిగిన ఘటన కోదాడలో జరిగింది. ప్రవీణ్ కుమార్, పృథ్వీ రమణీ ఇద్దరు దంపతులు. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో గత కొంతకాలంగా వారు విడివిడిగా దూరంగా ఉంటున్నారు. బాబుని తల్లిదండ్రుల చెంతనే ఉంచి పృథ్వీ రమణీ కెనడా వెళ్లింది. వారం వారం కుమారుడిని చూసేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటున్న ప్రవీణ్.. తన కొడుకును చూడకుండా అత్తామామలు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నాడు. తన నుంచి కొడుకును దూరం చేసే కుట్ర జరుగుతోందంటూ ప్రవీణ్.. తన తల్లిదండ్రులతో కలిసి అత్తగారింటి ఎదుట ఆందోళనకు దిగాడు.