Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి: దేశంలో మళ్లీ కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతోందా అంటే అవునంటున్నాయి మహారాష్ట్ర వైద్యాధికారులు...మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో కొవిడ్ వైరస్ వల్ల తాజాగా ముగ్గురు మరణించడం సంచలనం రేపింది. గత 24 గంటల్లో 562 కరోనా కేసులు తాజాగా నమోదయ్యాయి. దీంతో ఒక్క మహారాష్ట్రలోనే యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,488కి చేరుకుంది. ఆర్థిక రాజధాని నగరంగా పేరొందిన ఒక్క ముంబయిలోనే 24 గంటల్లో 172 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్రలోని ముంబయి జిల్లాలో 1,070 కొవిడ్ పాజిటివ్ కేసులు,పూణే జిల్లాలో 766, థానే జిల్లాలో 616 కేసులు నమోదైనాయి.