Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి: అయోధ్య నగరానికి చెందిన రిషిసింగ్ ఇండియన్ ఐడల్ 13 విజేతగా నిలిచారు. ఆదివారం అర్ధరాత్రి ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇండియన్ ఐడల్ విజేతగా ఎంపికైన రిషిసింగ్ రూ.25లక్షల చెక్కు, కారును బహుమతిగా తీసుకెళ్లారు. దేబాస్మితా రాయ్, చిరాగ్ కొత్వాల్ మొదటి, రెండవ రన్నరప్గా నిలిచారు. గ్రాండ్ ఫినాలే షోకు సోనాక్షి కర్, శివమ్ సింగ్, బిదీప్త చక్రవర్తి చేరారు.ప్రముఖ రియాలిటీ షోకు హిమేష్ రేషమియా, విశాల్ దద్లానీ, నేహా కక్కర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. రిషి అనాథ అయిన తన జీవితం గురించి చెబుతూ తన తల్లిదండ్రులు తనను ఎలా దత్తత తీసుకున్నారనే కథను వివరించారు.తనను దత్తత తీసుకోకుంటే తాను మరణించి ఉండేవాడినని రిషి చెప్పారు.